చిరుత ఇంకా రాజమండ్రి శివార్లలోనే ఉంది... ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎఫ్ఓ భరణి

  • రాజమండ్రి శివార్లలో చిరుత కలకలం
  • రేడియో స్టేషన్ లో కనిపించిన చిరుత
  • 4 చోట్ల బోన్లు ఏర్పాటు చేసిన అటవీశాఖ సిబ్బంది
  • దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ లో చిరుత కదలికలు గుర్తించామన్న డీఎఫ్ఓ
రాజమండ్రిలో చిరుతపులి కలకలం కొనసాగుతోంది. రాజమండ్రి శివార్లలోని ఆల్ ఇండియా రేడియో కేంద్రం వద్ద చిరుతపులి కదలికలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఓ పందిని వెంటాడుతూ చిరుత రేడియో కేంద్రంలోకి ప్రవేశించింది. 

దీనిపై డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్ఓ) భరణి స్పందించారు. ఆ చిరుత ఇంకా రాజమండ్రి శివారు ప్రాంతాల్లోనే సంచరిస్తోందని వెల్లడించారు. దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో పులి కదలికలు గుర్తించామని చెప్పారు. చిరుతను గుర్తించేందుకు 50 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని, 4 చోట్ల బోన్లు ఏర్పాటు చేశామని వివరించారు. 

చిరుత సంచారం నేపథ్యంలో, రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోని పొలాల్లో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని డీఎఫ్ఓ భరణి సూచించారు. రాత్రివేళ పొలాల్లో ఒంటరిగా పడుకోవద్దని స్పష్టం చేశారు.

Leopard
Rajahmundry
DFO Bharani
Reserve Forest

More Telugu News